PPM: విద్యార్థుల బంగారు భవితకు ప్రామాణిక విద్య, మెరుగైన ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. కొమరాడ మండలం విక్రమపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. విద్యార్థినీ, విద్యార్థుల ముఖాముఖి మాట్లాడి పాఠ్యాంశాలు, ఆంగ్ల భాషపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు.