GNTR: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఉదయం భారీగా మంచు కురిసింది. తెల్లవారుజాము నుంచే మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలకు లైట్లు వేసుకుని నిదానంగా వెళ్లారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షంలా మంచు కురవడంతో ఉదయాన్నే పనులకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు.