TPT: చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో జరుగుతున్న చిల్లకూరు మండలం సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మండల క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు రూ. 50,000 విరాళాన్ని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ… గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ప్రధానంగా క్రికెట్పై ఆసక్తి కనబరచాలన్నారు.