కోనసీమ: వరుస విపత్తులతో విలవిల్లాడుతున్న రైతన్నకు పాలకులు దన్నుగా నిలవడం లేదు. అయినవిల్లి మండలంలో సుమారు ఎనిమిది వేల హెక్టార్లలో వరి పంటను సాగు చేస్తున్నారు. సాగు నీరందక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.