SKLM: మన్నయ్యపేట గ్రామంలో పగటిపూట నిత్యం వీధి దీపాలు వెలుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీపాలు వెలగడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగడం వలన పంచాయతీకి అదనపు భారం పడుతుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పగటిపూట విద్యుత్ దీపాలు వెలగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.