ASR: డుంబ్రిగూడ మండలంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణకుమారి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె నిరుపేద గిరిజనులను గుర్తించి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కష్టాల్లో ఉన్న గిరిజనులకు తమ వంతు ఎంతో కొంత సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.