AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఈనెల 8, 9, 10వ తారీకుల్లో జరిగే గౌరీ పరమేశ్వరుల తీర్థ మహోత్సవం నేపథ్యంలో రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్సై రాజారావు గ్రామ పెద్దలతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. స్టేజ్ ప్రోగ్రాములు ఉన్న రోజున పోలీసు అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు.