ELR: ఉంగుటూరు మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూలు చేస్తామని ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరకు నూరు శాతం పన్ను వసూలు చేసే లక్ష్యంగా పంచాయితీ కార్యదర్శులు పనిచేయాలన్నారు. మొండి బకాయి దారులకు కార్యదర్శులు నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలన్నారు.