KDP: వేముల పంచాయతీ పరిధిలోని శేషన్నగారిపల్లెలో ఆదివారం శ్రీ సీతారామ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పురోహితులు ఆలయంలో శ్రీ సీతారామ, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించి హోమాలు పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివార్లను భక్తులు, వైసీపీ శ్రేణులు దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించారు.