అన్నమయ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలను దుబారా చేస్తున్నారని ఈ రోజు రాయచోట్ల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెల సాధారణంగా జరిగే పెన్షన్ కార్యక్రమానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దుబారా ఖర్చు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.