అన్నమయ్య: నిన్న సీఎం చంద్రబాబు సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ్ ప్రజా సమస్యలపై నినాదాలు చేస్తే అరెస్టు చేయడాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు ఖండిస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ మదనపల్లె మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయకూడదని అలాగే బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలంటూ నినాదాలు చేశారన్నారు. మాధవ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.