SKLM: రథసప్తమి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఆదివారం డచ్ భవనం వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉచిత హెలీ టూరిజం విహారానికి అవకాశం కల్పించారు. విద్యార్థులను దగ్గరుండి హెలికాప్టర్ ఎక్కించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.