KRNL: పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యావిధానాలు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వి.విజయరామరాజు అన్నారు. కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని పాఠశాలలను బలోపేతం చేయడం, జీవో నం.117 ఉపసంహరణ అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించారు.