KRNL: కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ 5వ సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను వీసీ ఆచార్య డీవీఆర్ సాయి గోపాల్ శుక్రవారం విడుదల చేశారు. 2024 అక్టోబర్ నెలలో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో 206 మంది ఉత్తీర్ణత సాధించారని క్లస్టర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ వీవీఎస్ కుమార్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. నాగరాజ్ శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు.