ASR: కొయ్యూరు మండలం బాలారం పంచాయతీలో మూడు రోజుల నుంచి సెల్ సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ అప్పలనర్స ఆదివారం తెలిపారు. పాత బాలారం గ్రామంలో ఏర్పాటు చేసిన టవర్ తరచూ మరమ్మతులకు గురవుతూ సెల్ సిగ్నల్స్ నిలిచిపోతున్నాయని అన్నారు. దీంతో సుమారు 6 పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరారు.