»Joined Bjp To Khushbu Sundar Amid Row Over Her Modi Tweet
Kushboo : తెలివిగా కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ..!
Kushboo : రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే బీజేపీ నేత ఖుష్బూ 2018లో మోదీని విమర్శిస్తూ చేసిన ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పోలి ఉన్న ఆ ట్వీట్ని కాంగ్రెస్ నేతలు నెట్టింట వైరల్ చేస్తూ ఓ వైపు ఖుష్బూని మరో వైపు బీజేపీని టార్గెట్ చేయడం చేయడం మొదలుపెట్టింది.
ఈ మొత్తం వ్యవహారం సంచలనంగా మారడంతో ఖుష్బూ తాజాగా స్పందించారు. అది ముగిసిపోయిన ఉదంతమని, చచ్చిన పామును మళ్లీ చంపేందుకు కాంగ్రెస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘అప్పట్లో అది నాకున్న అభిప్రాయం. చాలాకాలం కిందటే నా అవగాహన మెరుగుపడి మోడీ విషయంలో అభిప్రాయం మారిపోయింది. ఆ తరువాత నా ఆలోచనా ధోరణి మార్చుకుని బీజేపీలో చేరా. కాబట్టి.. నాటి విషయమై క్షమాపణ చెప్పేందుకు నేనేమాత్రం సంకోచించను. అయినా.. అది ముగిసిన అధ్యాయం. కాబట్టి.. చచ్చిన పామును చంపేందుకు ప్రయత్నిస్తున్నందుకు వాళ్లమానాన వాళ్లని వదిలేయడమే’’ అని కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. చాల తెలివిగా ఆమె ఈ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండటం విశేషం.