కడప: విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని శుక్రవారం వైవియూలో వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ నిర్వహణతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నవారు దేశ విదేశాల్లో రాణిస్తారన్నారు. పరిశ్రమలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాస్తవ స్థితిగతులతో జ్ఞానం వృద్ధి చెందుతుందన్నారు.