కృష్ణా: జగన్ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఆయన తుగ్లక్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నందిగామ MLA తంగిరాల సౌమ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపు భారం ముమ్మాటికీ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితమేనని అన్నారు. తన పార్టీ ఉనికి కోసం జగన్ సరికొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు.