NTR: విజయవాడ నగరంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయాలు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని 2,392 మంది వ్యక్తుల వద్ద నుంచి రూ. 9,50,725 రుసుము వసూలు చేశామన్నారు.