CTR: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, నేడు కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచడం దారుణమన్నారు.