W.G: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు మండలం తాడిమళ్ళలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న 5 మంది బాధిత లబ్ధిదారులకు రూ.4.61లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ఈకార్యక్రమంలో తాడిమళ్ళ గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.