SRPT: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించాలని కోదాడ పట్టణ సీఐ రాము అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు 35, ఆటోలు 33 పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఆటోలలో పరిమితి మించి ప్రయాణికులని నడపొద్దని సౌండ్ సిస్టం ఉండొద్దని అన్నారు.