KNR: హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దేశ్వర గుట్టపై ఈనెల 26న గురువారం శ్రీ అయ్యప్ప దేవాలయంలో ‘మండల పూజా మహోత్సవం (పడిపూజా)’ నిర్వహిస్తున్నామని దేవాలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. గురువారం రాత్రి 7 గంటలకు శ్రీమాన్ సి. వెంకటేశ్ శర్మ గురు స్వామి ఆధ్వర్యంలో ‘మహా పడిపూజా’ కార్యక్రమం జరుగుతుందన్నారు.