BDK: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఆస్పత్రిలో పర్యటించిన ఆయన కార్మికులతో మాట్లాడారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల పెంపు, రావాల్సిన ఏరియర్స్ వచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరపుతామని హామీ ఇచ్చారు.