AP: ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సృష్టించాయి. ముండ్లమూరు మండలంలో ఉదయం 10:40 గంటల సమయంలో 2 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిన్న ఇదే సమయంలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కురిచేడు మండలాల్లో భూ ప్రకంపనలు జరిగాయి. నిన్న రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది.