ప్రకాశం: సంతనూతలపాడు మండలపరిధిలోని ఎండ్లూరు డొంకవద్ద మహిళా ప్రాంగణంలో ఈనెల 23వ తేదీన ఇన్ఫో సెవెన్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. జిల్లాలో 18-30 సంవత్సరాల వయస్సుగల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.