పల్నాడు: దాచేపల్లి పట్టణంలోని అలంకార్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు గొర్రెల మందను ఢీకొట్టడంతో సుమారు 150 గొర్రెలు మృతిచెందాయని, గొర్రెల కాపరి మల్లేష్కి తీవ్రమైన గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ నుంచి దాచేపల్లి మండలం మాదినపాడుకు గొర్రెల మంద వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.