GNTR: పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక సూచించారు. సమ్మేటీవ్ అసెస్మెంట్ టర్మ్-1 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని స్టాల్ బాలికల ఉన్నత పాఠశాల, పట్టాభిపురం నగరపాలక ఉన్నత పాఠశాలను బుధవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు.