నల్గొండ: నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వే బృందాలకు సూచించారు. బుధవారం ఆమె నల్గొండ మండలం చిన్న సూరారం గ్రామపంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన సర్వేను తనిఖీ చేశారు. సర్వే బృందాలతో మాట్లాడుతూ.. ఇంటి యజమానుల పూర్తి వివరాలను సేకరించాలన్నారు.