సత్యసాయి: నల్లచెరువు మండలంలో గురువారం కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పర్యటించనున్నారు. మండల పరిధిలోని పీ. కొత్తపల్లిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుకు హాజరవుతారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు పిలుపునిచ్చారు.