KNR : పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, తాజా మాజీ సర్పంచ్లు కరీంనగర్లో పోరుబాట పట్టారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. దాదాపు ఏడాది నుంచి బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.