E.G: రాజమండ్రి రూరల్ మండలంలోని కోలమూరు గ్రామం జాతీయ రహదారి వంతెన దిగువన ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రూట్ వాచ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆటోలో తనిఖీలు నిర్వహించగా 10 కిలోల గంజాయిని గుర్తించి, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.