కోనసీమ: మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీపీఐ రాజోలు ఏరియా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ కోరారు. మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం సఖినేటిపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.