NLR: ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును అమరావతిలోని సచివాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ, డేగపూడి – బండేపల్లి కాలువ, కనుపూరు కెనాల్ పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే త్వరితగతిన పనులు చేపట్టాలని కోరారు.