కృష్ణా: విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను టీడీపీ MLA పరుచూరి అశోక్ బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు తిలకించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. విద్యార్థులలో ఆలోచన శక్తి, నైపుణ్యం పెంచే దిశగా పాలీటెక్ ఫెస్ట్ దోహదపడుతుందన్నారు.