కృష్ణా: నందిగామలో మంగళవారం మహిళా సాధికారత కింద మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందించారు. ఏపీ లయన్స్ సేవా యజ్ఞంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ అధ్యక్షుడు మందడపు సీతారామయ్య అధ్యక్షతన రైతుపేట రామకృష్ణ ప్లాజాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ సభ్యులు డాక్టర్ యర్రంరెడ్డి గాంధీ, డాక్టర్ పులి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.