కృష్ణా: ఎ.కొండూరు మండలంలోని పాత కొండూరు పెద్దబీడులో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇచ్చి ఆన్ లైన్లో పేర్లు నమోదు చేయాలని కోరుతూ.. మండల సీపీఎం ఆధ్వర్యంలో దళితులు కొండూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 7న జరిగిన రెవెన్యూ సదస్సులో దళితులు తహశీల్దార్ ఆశయ్యకు వినతి పత్రం అందజేసినట్లు మండల సీపీఎం పార్టీ కార్యదర్శి పానెం తెలిపారు.