KDP: కడప నగర మేయర్ నీటి సమస్యల గురించి పట్టించుకోవడంలేదని టీడీపీ నాయకుడు జిలాన్ తెలిపారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ.. కడప వైసీపీ కార్పొరేటర్లు త్రాగు నీటి గురించి అడిగితే సాగు నీటి లెక్కలు చెబుతూ.. సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. కడపలో నీటి సమస్యపై, కార్పొరేషన్ అవినీతిపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.