MDK: తెలంగాణ తల్లిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలంలోని దౌల్తాబాద్(కాసాల) చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తల్లికి రూపురేఖలను తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ తల్లిగా తీర్చిదిద్దడంపై మండిపడ్డారు. జై తెలంగాణ అని నినాదాలు చేశారు.