KMR: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎల్లారెడ్డి పాఠశాల మైదానంలో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో RDO, ఉపాధ్యాయులు, స్థానిక మండల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.