KMM: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ జాతీయ సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ..ఆదానీ అవినీతిపై పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టాన్ని మణిపూర్ నుండి ఉపసంహరించుకోవాలని అన్నారు.