SRD: మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించి ఇంట్లో కుటుంబ పోషణ కూడా చూసుకోవడంతో ఒత్తిడికి గురవుతారని చెప్పారు. వీరికోసమే అవగాహన సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు.