ELR: ఈనెల 13, 14, 15వ తేదీల్లో బుట్టాయిగూడెంలో జరుగుతున్న సీపీఎం 25వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ కోరారు. మంగళవారం పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనం వద్ద సీపీఎం 25వ జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. 13వ తేదీన బుట్టాయిగూడెంలో సీపీఎం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.