అన్నమయ్య: వాల్మీకి , బోయల అభివృద్ధికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు మండెం ప్రభాకర్, నల్లబోతుల నాగరాజులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మదనపల్లె పట్టణంలో నూతన డైరెక్టర్లను వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్త రాశి హరికృష్ణ, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్టీ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు.