దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. అతనిపై మోసం, నమ్మకద్రోహం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయినప్పటికీ విచారణకు హాజరయ్యారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో మొదటి సారి కోర్టు మెట్లెక్కడం తొలిసారి కావడం విశేషం.