SKLM: శ్రీకాకుళం పట్టణం మిడి కవర్ వద్ద శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు మంగళవారం వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఇటీవల దొంగలించబడిన నాలుగు బైకులతో పాటు నిందితులు పట్టుకోవడం జరిగిందని సీఐ ఈశ్వరరావు తెలిపారు. వాళ్ళు ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందినవారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.