ATP: ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచిరూ.22 లక్షల విలువైన 310 గ్రాముల బంగారు నగలు, ఒక కారు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.