AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన అందరినీ కలచివేసింది. అయితే, బాణాసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడికి ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. చివరికి ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించే ప్రాంతానికి చేరుకునే సరికే చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.