RR: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన శివారులో ఉన్న ఓ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పునరుత్పాదక శక్తి వనరులు, పర్యావరణ పరిరక్షణ, స్మార్ట్ సిటీ నమూనాలు, సైన్స్ ఆధారిత ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.