అల్లూరి: జనాభా గణన-2027లో భాగంగా జరుగుతున్న మొదటి దశ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. “ఇళ్ల జాబితా, ఇళ్ల గణన” ప్రక్రియ జూన్ నెలతో ముగుస్తుందన్నారు. దీనికి సంబంధించిన ఎన్యుమరేటర్ల క్షేత్ర పర్యటన నేటితో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకోని వారు ఇవాళ్టిలోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.